calender_icon.png 13 October, 2024 | 8:47 PM

సెమీస్‌లో గాయత్రి జంట

28-09-2024 12:00:00 AM

మకావు ఓపెన్

మకావు: భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపిచంద్ జాలీ మకావు ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లారు. సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి జంట 21 21 సు యిన్ లొన్ యున్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. 39 నిమిషాల్లోనే ప్రత్యర్థి జంట ఆటను కట్టించిన గాయత్రి జోడీ టైటిల్‌కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది.

సెమీఫైనల్లో ఈ జోడీ పెయ్ షాన్‌h హంగ్ జూ (చైనీస్ తైపీ) జంటను ఎదుర్కోనుంది. ఈ ఏడాది గాయత్రి జంటకు ఇది రెండో సెమీఫైనల్. ఇక పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్స్‌కే పరిమితమైంది. క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 16 12           కా లాంగ చేతిలో ఓటమి చవిచూశాడు.