దుబాయ్: మకావు ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ డబుల్స్ ద్వయం గాయత్రి గోపిచంద్- త్రిసా జాలీ పోరాటం సెమీస్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్లో గాయత్రి జంట 17-21, 21-16, 10-21తో పెయ్ షాన్-ఎన్ జూ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూసింది.