మకావు: మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ద్వయం గాయత్రి గోపీచంద్-ట్రిసా జాలి డబుల్స్ విభాగంలోలో రెండో రౌండ్కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఈ జోడీ 15-21, 21-16, 21-14 తేడాతో అకారీ సాటోఛౌ తగుచి (జపాన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇక మహిళల డబుల్స్ క్వాలిఫికేషన్ రౌండ్లో సిక్కిరెడ్డి-శివాని జంట విజయం సాధించింది.