06-04-2025 09:15:16 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కుమారి కొండపల్లి గాయత్రి గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత పొందినందుకు ఆదివారం మాజీ సర్పంచ్ నీట్టు వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి చెందిన యువతి సాధారణ కుటుంబానికి చెందిన గాయత్రి గ్రూప్ వన్ ఉద్యమానికి ఎంపికైన సందర్భంగా మంగలి గౌరీ మకర మహాలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి తల్లిదండ్రులు కాలనీవాసులు పాల్గొన్నారు.