బీహార్లో వెలుగు చూసిన అమానవీయ ఘటన
పాట్నా, సెప్టెంబర్ 20: జేడీయూ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలి మెడలో ఆ పార్టీ నేత చెప్పుల దండ వేశాడు. గ్రామం లో ఆమెను ఊరేగింపు తీసుకెళుతూ మద్దతుదారులతో కలిసి దాడిచేశాడు. ఈ అవ మానవీయ ఘటన బీహార్లో వెలుగు చూసింది. సీతామర్హి జిల్లాలోని బైర్గానియా ప్రాంతంలో బుధవారం జేడీయూ నేతలు సమావేశం నిర్వహించగా, ఆ సమావేశానికి పార్టీ మహిళా సెల్ జిల్లా అధ్యక్షురాలు కామినీ పటేల్కు ఆహ్వానం అందలేదు. ఈ విషయంపై చర్చించేందుకు కామినీ వార్డు కౌన్సిలర్ సంజయ్సింగ్ ఇంటికి వెళ్లింది. అది కాస్తా రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. కౌన్సిలర్ మద్దతుదారులు కామినీ మెడలో చెప్పుల దండ వేసి దాడి చేశారు. ఆమెను వీధుల్లో ఊరేగించారు.