calender_icon.png 9 October, 2024 | 12:54 PM

డి-94 కాలువలో చెత్త తొలగింపు

09-10-2024 12:10:26 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ సొంత ఖర్చుతో పనులు

కరీంనగర్ రూరల్, అక్టోబరు 8: కరీంనగర్ రూరల్ మండలంలోని ఎస్సారెస్పీ డి-94 కాలువ ఆయకట్టుకు సాగునీరందడంలేదని రైతులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డిఢూ కాలువ నుంచి నీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులకు సూచించారు.

దీంతో కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్ల తొలగింపు పనులను బీజేపీ నాయకులు తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, మాడిశెట్టి సంతోష్ కుమార్, పాదం శివరాజ్, అనుముల మహేందర్ బుధవారం ప్రారంభించారు. బండి సంజయ్‌కుమార్ సొంత ఖర్చుతో చెత్త తొలగింపు పనులు చేపట్టినట్లు తెలిపారు.