calender_icon.png 25 October, 2024 | 2:56 AM

గంజాయి విక్రేత అరెస్ట్

25-10-2024 12:42:12 AM

పటాన్‌చెరు, అక్టోబర్ 24: గంజా యి వికేత్రను అరెస్ట్ చేసి 50 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. గురువారం పటాన్‌చెరు పోలీ సు స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కి తండాకు చెందిన మల్లేశ్ జాదవ్ హైదరాబాద్ నుంచి సొంత కారులో 50 కిలోల గంజాయిని కోహీ ర్ మండలంలోని మనియార్‌పల్లికి చెందిన వ్యక్తికి అందజేసేందుకు బయలుదేరినట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం పటాన్‌చెరు మండలంలోని కర్ధనూర్ గ్రామ శివారులో బీడీ ఎల్ భానూర్ సీఐ స్వామిగౌడ్ వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మల్లేశ్ జాదవ్ పట్టుబడినట్లు వెల్లడించారు.