ఆదిలాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): అదిలాబాద్ జిల్లాలో 48 కేసుల్లో 411 కేజీల గంజాయిని సోమవారం నిజామాబాద్లో దహనం చేశారు. గంజాయిని దహనం చేయాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ఉన్న రూ.కోటి విలువ చేసే 411 కేజీల గంజాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీ మెడికేర్ సరీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దహనం చేసినట్లు ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు.