ఆదిలాబాద్, అక్టోబర్ 18 (విజయ క్రాంతి): ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి కేసులో మరో నలుగురు అంతరాష్ర్ట ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. గత నెల తలమడుగు పీఎస్ పరిధిలో లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద ౯ క్వింటాళ్ల గంజాయి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించారు. వారిచ్చిన సమాచారంతో మహారాష్ర్టలో గోతి రాం గురుదయాల్ సాబ్లే, శుభం గోతిరాం సబ్లే, అమర్ సింగ్ నారాయణ గోతి, సోమనాథ్ బికా సాబ్లెలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్రధాన సూతధారి ని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.