calender_icon.png 10 October, 2024 | 2:49 AM

గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్

09-10-2024 12:00:00 AM

ఖమ్మం, అక్టోబర్ 8 (విజయక్రాం తి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుం చి గంజాయి తీసుకువచ్చి అమ్ముతు న్న ముఠాను ఖమ్మం జిల్లా సత్తుపలి పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి, గంజాయి అమ్ముతున్నారు. మంగళవారం కా రులో గంజాయి తరలిస్తున్న ఆరుగురిని ఆవులపాక వద్ద అదుపులోకి తీసుకున్నారు.

వారిలో కిష్టారం గ్రామానికి చెందిన పాశం వెంకటశివరామ కృష్ణ, సత్తుపల్లి ద్వారకాపురి కాలనీకి చెందిన కొమ్ము మనోవర్ధన్, నారాయణపురం గ్రామానికి చెందిన ఆరుమళ్ల తరుణ్‌కుమార్, సత్తుపల్లికి చెందిన వేల్పుల పుల్లారావు, ఆంధ్రాలోని ఏలూరు జిల్లాకు చెందిన కొత్త పల్లి రత్నబాబు ఉన్నారు. వారి నుం చి 5 కిలోల గంజాయి, కారు, రెండు బైకులు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు.