calender_icon.png 18 October, 2024 | 9:46 AM

కీలక పదవిలో గంగూలీ

18-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యా డు. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కంపెనీ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ జట్టుకు, సౌతాఫ్రికాటీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిట ల్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న గంగూలీ ఈ మూడు లీగుల్లోనూ ఆయా జట్లకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడని జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యం తెలిపింది.