27-02-2025 01:33:42 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి26: మహాశివరాత్రి పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలసి వేములవాడ రాజ రాజేశ్వరస్వామి వారిని దర్శించుకొన్న మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఈ సందర్బంగా ఆలయ వేద పండితులు గంగుల కుటుంబసభ్యులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.