calender_icon.png 2 October, 2024 | 1:46 PM

గాంధీకి నివాళులర్పించిన గంగుల కమలాకర్

02-10-2024 11:53:27 AM

కరీంనగర్, (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కోతి రాంపూర్ లోని గాంధీ విగ్రహానికి కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా స్వతంత్ర పోరాటంలో గాంధీ సత్యాగ్రహ పోరాటాన్ని కొనియాడారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు