calender_icon.png 26 October, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్‌ను తలపిస్తున్న ‘గ్యాంగ్‌స్టర్’

25-10-2024 12:00:00 AM

చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్‌స్టర్’. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీశ్‌కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ పతాకంపై చంద్రశేఖర్ రాథోడ్ స్వీయ దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా ఈ నెల 25న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నిర్వహించింది. కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృ తిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, యంగ్ హీరో ఆకాశ్ పూరి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వ్యాప్తం గా ఉన్న సినీ కళాకారులను వెలికి తీసే ప్రయత్నంలో ఎందరో ప్రతిభావంతులైన యువకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

వాళ్లలో చంద్రశేఖర్ రాథోడ్ ఒకరు. యాక్షన్ సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. అలాంటిది చంద్రశేఖర్ బాలీవుడ్ చిత్రాన్ని తలపించే యాక్షన్ సినిమాతో వస్తుండటం అభినందనీయం’ అన్నారు. హీరో ఆకాశ్ పూరి మాట్లాడుతూ.. “గ్యాంగ్‌స్టర్’ సినిమాకు ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు. చంద్రశేఖర్ గారు కథ రెడీ చేసుకుంటే నేను ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.

ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం.. ఇవన్నీ ఒక్కరే చేయడం ఈజీ కాదు. చంద్రశేఖర్ రాథోడ్ గారు అమేజింగ్ వర్క్ చేశారు” అని తెలిపారు. “సినిమా మీద ప్యాషన్‌తో ‘గ్యాంగ్‌స్టర్’ను రూపొందించాను. సినిమా తెరకె క్కించడం, హీరోగా నటించడం నా కల.

ఈ చిత్రంతో ఆ డ్రీమ్ నిజమైంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చిత్రాన్ని రూపొందించాను” అని హీరో చంద్రశేఖర్ రాథోడ్ చెప్పారు. దైవజ్ఞ శర్మ, నటుడు అభినవ్ జనక్, ఇతర చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రవి, నరసింహ; కెమెరా: జీఎల్ బాబు; ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత, దర్శకత్వం-: చంద్రశేఖర్ రాథోడ్.