calender_icon.png 5 October, 2024 | 2:47 AM

ఫ్రెండ్‌ను కొట్టి యువతిపై గ్యాంగ్‌రేప్

05-10-2024 12:44:54 AM

మహారాష్ట్ర పుణెలో ఘటన

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు

పుణె, అక్టోబర్ 4: సామాజిక కార్యకర్తలా నటిస్తూ ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె శివారు ప్రాంతం బోప్‌దేవ్‌ఘాట్ ప్రాంతంలో గురువారం రాత్రి 11 గంటలకు జరిగింది.

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒకరిని అరెస్టు చేయగా మిగతా ఇద్దరు నిందితులను గాలించేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశా మని చెప్పారు. అరెస్టయిన వ్యక్తి కోండ్వా వాసిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల యువతి తన స్నేహితుడితో గురువారం బోప్‌దేవ్ ఘాట్‌కు వెళ్లింది.

రాత్రి 11 గంటల సమయంలో నిందితుల్లో ఓ వ్యక్తి కారులో వచ్చి తానొక కార్యకర్త అని, ఈ ప్రాంతంలో జంటలు రావడం నిషేధమని చెప్పి వారి ఫొటోలు తీశాడు. అనంతరం యువతి స్నేహితుడిని కొట్టి ఆమెను బెదిరించి కారు లో బలవంతంగా ఎక్కించాడు.

కారులో యువతిని కొంతదూరం తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను అక్కడే వదిలేసి నిందితులు వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన యువతి పోలీసులకు శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.