హైదరాబాద్: నగరంలో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.60 లక్షల విలువైన 164 కిలోల గంజాయి, సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. 2 కేసుల్లో ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.