అఘాయిత్యానికి పాల్పడి డిచ్పల్లిలో వదిలి వెళ్ళిన అగంతకులు
మహిళ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన
ఆటోలో తీసుకెళ్ళి నలుగురు అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు
నిజామాబాద్ (విజయక్రాంతి): ఆటో ఎక్కి వెళ్లిన అమ్మాయిలపై నలుగురు గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి మహిళాపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిజామాబాదులో శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వారు డిచ్పల్లికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ బస్టాండ్ నుండి ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం డిచ్పల్లిలో మహిళను వదిలి వెళ్ళినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అగంతకులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఆటోలో వెళ్లడం వల్ల సిసి కెమెరాలు నమోదయినా దృశ్యాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.