calender_icon.png 12 March, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ సైబర్ కుట్ర భగ్నం...

11-03-2025 11:53:12 PM

పాత సెల్ ఫోన్ ల కొనుగోలు ముఠా అరెస్ట్...

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): స్టీల్ సామాన్లకు... ప్లాస్టిక్ డబ్బాలకు పాత సెల్ ఫోన్ లు కొంటాం... అంటూ మీ ఇంటి దగ్గరికి వచ్చే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త... స్టీల్ సామాండ్లకు... ప్లాస్టిక్ డబ్బాలకు ఆశపడి పాత సెల్ ఫోన్ లే కదా.. అని అమ్మేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు... మీరు అమ్మిన ఫోన్ లతో సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. స్టీల్ డబ్బాల ఆశ చూపి పాత సెల్ ఫోన్ లను కొనుగోలు చేసి, వాటిని బీహార్ లో A1 తబరాక్ అనే వ్యక్తికి అమ్మి వేస్తూ సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను ఆదిలాబాద్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం పోలీస్ హెడ్ కార్టర్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు.

సైబర్ నేరాలకు పాల్పడే ఆరుగురు ముఠా సభ్యుల్లో A1 తబరాక్ పరారీలో ఉండగా, A2 మొహమ్మద్ మెరాజుల్, A3 మహబూబ్ ఆలం, A4 మొహమ్మద్ జమాల్, A5 ఉజీర్, A6గా అబ్దుల్లాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుండి 2,125 పాత ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలు, 107 సిమ్ కార్డులు, ఐదు దిచక్ర వాహనాలను సాధీనం చేసుకున్నామన్నారు. ఫోన్లు కొనుగోలు చేసిన వారు బీహార్ లో సైబర్ నెరగాళ్లకు వాటిని అమ్ముతున్నారన్నారు. కొనుగోలు చేసిన పాత ఫోన్ లు, సిమ్ కార్డు, ఈఎంఐ నెంబర్ల ను ఉపయోగిస్తూ సైబర్ నేరగాళు సైబర్ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, హసీబుల్లా, సీఐ కమలాకర్ రావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.