13-02-2025 09:28:02 AM
చితకభాదిన గ్రామస్తులు
అందోల్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామంలో గురువారం తెల్లవారు జామున దోపిడీ దొంగల ముఠాను గ్రామ యువకులు పట్టుకున్నారు. పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట, మంతూర్, రాయిపాడ్ గ్రామాల ప్రజలకు గత నెల రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దోపిడీ దొంగల ముఠాను పెద్దారెడ్డిపేట గ్రామస్థులు పట్టుకుని కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు.