కోదాడ, అక్టోబర్ ౨౬: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. రామాపురంలో మేళ్లచెర్వు ఎస్సై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బైకుపై వెళ్తున్న చెన్నారం గ్రామానికి చెందిన తుమ్మడపల్లి సైదులు, గురజాలకు చెందిన పిన్నెబోయిన నాగేశ్వరరావు పోలీసులను చూసి పారిపోయారు.
వెంబడించి వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా హుజూర్నగర్ పరిధిలోని రేవూరు, జాన్పహాడ్ పరిసర ప్రాంతా ల్లో తాళం వేసిన ఇళల్లో దొంగతనాలకు పాల్పడినట్టు అంగీకరించారని తెలిపారు. ఆ సొత్తును దాచిన సైదులు భార్య దుర్గ, వీరి బంధువు నల్లూరి నరసింహారావును కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 8 తులాల బంగారం, 15 తులాల వెండి, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు ట్రాక్టర్ ట్రక్కులు రికవరీ చేసినట్లు వివరించారు.