calender_icon.png 24 October, 2024 | 7:52 AM

నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి

12-09-2024 12:33:18 PM

కరీంనగర్, (విజయక్రాంతి): గణేశుడి నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్ (స్థానిక సంస్థలు), లక్ష్మి కిరణ్ (రెవెన్యూ) అన్నారు. గురువారం మానకొండూర్, చింతకుంట, కొత్తపల్లి చెరువులను పరిశీలించారు. నిమజ్జనం లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను  ఆదేశించారు.  అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చే యాలన్నారు. వారి వెంట జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు