కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లు పూర్తిచేయాలని హైదరాబాద్ కలెక్టర్ అను దీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం బాపుఘాట్ను సందర్శించిన కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2న ఉదయం 6గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, 10గంటలకు సీఎం రేవంత్రెడ్డి బాపూఘాట్లో నివాళులర్పిస్తారని తెలిపారు.
మంగళవారం సాయంత్రంలోపు ఏర్పా ట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ప్రూఫ్ టెంట్లు, రెండు మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్ను అం దుబాటులో ఉంచాలని సూచించా రు. సర్వమత ప్రార్థనలు నిర్వహించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ చం ద్రశేఖర్, ఆర్డీవో మహిపాల్, డీఈవో ఆర్.రోహిణి, తహసీల్దార్ అహల్యరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.