calender_icon.png 14 October, 2024 | 5:55 AM

భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమర్జనం

11-09-2024 07:19:34 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర, గిరిజన బాలికల గురుకుల విద్యాసంస్థల్లో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని నెలకొల్పిన గణనాథున్ని బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో విద్యార్థులు,సిబ్బంది శోభాయాత్రగా వెళ్లి వాగులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ ,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.