నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్ మురళీకృష్ణ ఆలయంలో వసంత పంచమి వేడుకలు పురస్కరించుకుని భక్తుల గానామృత కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో భక్తులు సరస్వతి దేవిని కొలుస్తూ భజనలు సంకీర్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు సెట్ గంగాధర్, కిషన్ సెట్ తదితరులు ఉన్నారు.