న్యూఢిల్లీ: హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా ఎంపికయ్యాడు. భారత టెన్నిస్ జట్టు కెప్టెన్ రోహిత్ రాజ్పాల్తో కలిసి అతడు విశ్వక్రీడల్లో ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గతంలో చెఫ్ డి మిషన్గా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ను నియమించగా.. వ్యక్తిగత కారణాల కారణంగా ఆమె తప్పుకుంది. దీంతో ఈ ఇద్దరిని ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఆదివారం వెల్లడించింది. ఇప్పటికే భారత్ నుంచి వివిధ క్రీడా విభాగాల్లో పారిస్ ఒలింపిక్స్కు వంద మందికి పైగా అర్హత సాధించారు. ఆదివారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా విశ్వక్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో భేటీ అయ్యారు. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలతో పాటు.. క్రీడల్లో పాల్గొనే భారత జట్టు జెర్సీలను కేంద్ర మంత్రి విడుదల చేశారు.