హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): అక్టోబర్ 3వ తేదీ నుంచి 5 వరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగనున్న జీ-స్పార్క్ 2024ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇన్ఫెక్షన్ నివారణ, నియం త్రణ, యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్షిప్పై గ్లోబల్ సదస్సు జరుగుతుందని జీడూ 2024 చైర్మన్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు సుమారు 16 వందల మంది పాల్గొంటారని పేర్కొన్నారు.