03-03-2025 06:46:36 PM
భైంసా (విజయక్రాంతి): ముధోల్ మండల కేంద్రంలో సోమవారం రహదారి ప్రమాదంలో మృతి చెందిన వాహనానికి హిందూ వాహిని కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వానరం రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న యువకులు వానరానికి అదే ప్రాంతంలో గుంత తీసి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించినట్టు హిందూ వాహిని సభ్యులు తెలిపారు.