calender_icon.png 13 March, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపాలపురం చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

13-03-2025 12:00:00 AM

ప్రజాతంత్ర ఆలోచన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దశరథం 

హనుమకొండ, మార్చి 12 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగరి 56 వ డివిజన్ గోపాపూర్ ఊర చెరువు అభివృద్ధి పరిరక్షణకు, సుందరీకరణకు నిధులు మంజూరి చేయించాలని ప్రజాతంత్ర ఆలోచన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తుపాకుల దశరథం వర్ధన్నపేట ఎమ్మెల్యే  కె ఆర్ నాగరాజు ను  కోరారు.

ఈ మేరకు ఎమ్మెల్యే నాగరాజును హైదరాబాదులోని సచివాల యం వద్ద కలిసి బుధవారం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తుపాకుల దశరథం మాట్లాడుతూ  గోపాల్ పూర్  చెరువు అభివృద్ధి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు మంజూరు చేయిం చాలని కోరారు. గోపాల్ పూర్ చెరువులో మురికి నీరు ప్రవహించకుండా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.