ముషీరాబాద్, అక్టోబర్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వం అంబేడ్కర్ అభయహస్తం పేరిట బడ్జెట్లో కేటా యించిన రూ.17వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. శనివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘దళితబంధు నిధుల కేటాయింపు జాప్యం’పై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ, బంధు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లెల వీరస్వామి, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బీఎన్ రమేష్ మాదిగ, మాల మాదిగల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ తిరుపతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అంబేద్కర్ అభయహస్తం పథకానికి నిధులు విడుదల చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు.