13-03-2025 06:46:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ఈనెల 19న ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ బుధవారం పిడి నాగజ్యోతికి వినతి పత్రం అందించారు. బడ్జెట్లో 15% నిధులు కేటాయించడం వల్ల అంగన్వాడీలు బలోపితం అయి పిల్లల మంచి పోషకాహారం అందుతుందని ఈ డిమాండ్ ను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఈనెల 17 18 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లలిత లలిత శైలజ తదితరులు పాల్గొన్నారు.