కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్, అక్టోబరు 19 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో ఆగిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టర్ పమేలా సత్పతిని కోరారు. ఈ మేరకు శనివారం వినతిపత్రం అందజేశారు.
గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమం, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సమీకృత కూరగాయల మార్కెట్లకు నిధులు మంజూరయ్యానని ఎమ్మెల్యే తెలిపారు. పూర్తికావస్తున్న దశలో నూతన ప్రభుత్వం ఏర్పడి, చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి, పనులు ప్రారంభించాలని కోరారు.