calender_icon.png 21 October, 2024 | 3:07 AM

చికెన్ బిర్యానీలో కప్ప

21-10-2024 12:39:37 AM

  1. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మెస్‌లో కలకలం 
  2. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు

శేరిలింగంపల్లి, అక్టోబర్ 20: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మెస్‌లో చికెన్ బిర్యానీలో కప్ప ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. ట్రిపుల్ ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు బుధవారం (అక్టోబర్ 16న) బిర్యానీ పెట్టారు.

అయితే, ఓ విద్యార్థికి వడ్డించిన బిర్యానీలో చికెన్ పీస్‌తో పాటు కప్ప కూడా వచ్చింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కప్ప పూర్తిగా ఉడికిపోయిన స్థితిలో మసాలాతో కనిపించింది. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.