calender_icon.png 23 October, 2024 | 8:57 AM

స్నేహభావం పెంపొందించేందుకే ఫ్రెండ్లీ క్రికెట్

29-08-2024 01:35:42 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): స్నేహభావం పెంపొందించేందుకే ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగిందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ డివి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డిఎఫ్ఓ నీరజ్ కుమార్, డి.ఎస్.పి సదయ్యలతో కలిసి క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే రెవెన్యూశాఖతో పాటు వివిధ శాఖలు, పోలీస్, జర్నలిస్టులు జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవడం జరుగుతుందన్నారు. క్రీడలు మానసిక ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు. ఏ రంగంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంత దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైస్ ఓ రమాదేవి గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి రెవెన్యూ సిబ్బంది,ఉపాధ్యాయలు, పోలీస్ లు, జర్నలిస్టులు పాల్గొన్నారు