ఆందోళనలో బస్తీ వాసులు
బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ బస్తీలో ఉన్న పాత మంచినీళ్ల ట్యాంకు కూలేందు సిద్ధంగా ఉంది. పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పాడుబడ్డ మంచినీళ్ల ట్యాంకును తొలగించాలని అధికారులకు విన్నవించినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని బస్తీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మంచినీళ్ల ట్యాంకుకు పక్కనే ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉండడంతో అది కూలితే విద్యార్థులు ప్రమాదం బారిన పడే అవకాశాలు లేకపోలేదు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వెంటనే శిథిలావస్థకు చేరిన మంచినీళ్ల ట్యాంకులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.