హైదరాబాద్, అక్టోబర్ 8: దసరా, దీపావళి పండుగల సందర్భంగా ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ పేరుతో ఫ్రీడమ్ బ్రాండ్ ఆయిల్స్ ఉత్పాదక సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ కొత్త ఆఫర్ను ప్రకటించింది. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ ఆఫర్ నవంబర్ 14వరకూ 45 రోజులపాటు అమలులో ఉంటుంది.
ఈ స్కీమ్ కింద ప్రతీ రోజూ 100 మంది వినియోగదారులు లక్కీ డ్రా ద్వారా 1 గ్రాము బంగారాన్ని గెలుపొందే అవకాశంతో పాటు బంపర్డ్రాలో పాల్గొనవచ్చని కంపెనీ ప్రకటన తెలిపింది. ఈ ఆఫర్లో పాల్గొనదల్చిన వినియోగదారులు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ 1 లీటర్ పౌచ్లు రెండింటిని కొనుగోలు చేయాలి.వాటి కొను గోలుకు లభించే స్క్రాచ్ కార్డు ద్వారా స్కీమ్లో పాల్గొనవచ్చు.
స్కీమ్ ముగిసిన తర్వాత బంపర్డ్రాలో 5 మంది విజేతలకు ఒక్కొక్కరికీ 50 గ్రాముల బంగా రు నాణెం, 10 మందికి ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారు నాణేం లభిస్తుందని జెమినీ ఎడిబుల్స్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు కర్నాటక, చత్తీస్ఘర్ల్లో ఈ స్కీమ్ అమలవుతుంది.