calender_icon.png 27 October, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల త్యాగాలతోనే తెలంగాణకు స్వేచ్ఛ

18-09-2024 12:00:00 AM

అటవీ శాఖ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌ఎం డోబ్రియల్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): నిరంకుశత్వానికి వ్యతిరే కంగా జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి పోరాటంతోనే తెలంలగాణకు విము క్తి లభించిందని అటవీ దళాల ప్రధా న సంరక్షణాధికారి ఆర్‌ఎం డోబ్రియల్ పేర్కొన్నారు. ప్రజాపాలన సందర్భంగా అటవీశాఖ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్క రించి ఆయన మాట్లాడుతూ..

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా తెలంగాణకు స్వేచ్ఛ లభించలేదని, నిరంకుశల పాలనకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ జాతి పోరాటం చేసిందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని డోబ్రియల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీఎఫ్‌లు సువర్ణ, ప్రియాం క వర్గీస్, రామలింగం పాల్గొన్నారు.