01-03-2025 05:55:43 PM
చేగుంట (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో చేగుంట మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ ఆఫీస్ యందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్య శిబిరంకు 162 మంది పేషేంట్ల రాగ వీరికి నిపుణులైన వైద్యులు డా.సుప్రజా, డా.సురక్ష, డా. అంకిత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోగ్రామ్ చెర్మన్లు డిస్ట్రిక్ చెర్మాన్ ఆకుల సుఖేందర్, అంబటి సురేష్, క్లబ్ ప్రెసిడెంట్ బుర్క నాగరాజు, సెక్రెటరీ రాజనకు రామచంద్రం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.