03-03-2025 12:39:36 AM
శేరిలింగంపల్లి, మార్చి 2 (విజయక్రాంతి):చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ లో మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు,బరువు, కంటి, దంత,రక్తపోటు,షుగర్, పల్స్,ఈ.సీ.జీ. (ఆర్థో)కు సంబందించిన మొదలగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ సలీం (కౌ డెంటల్), డాక్టర్ నిసార్, డాక్టర్ విజన్ ఐ కేర్ తదితరులు వైద్యసేవలు అందించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ... మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారఅని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున, కొన్ని జాగ్రత్తలు తీసుకున్న యెడల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ,ధ్యానము,నడక,కనీసం 40 నిమిషాలు చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కాలనీ వెల్ ఫెర్ నాయకులు సీతారామయ్య,సురేష్, సుమన్ రెడ్డి,మంగపతి, విజయ్ కుమార్ తదితరులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వర రాజు,హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు.