calender_icon.png 8 October, 2024 | 6:06 PM

Breaking News

పాలేరు రిజర్వాయర్‌లో ఉచిత చేప పిల్లల పంపిణీ

08-10-2024 02:54:54 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్వక్షతన జరిగిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

మంత్రి, అధికారులు, మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేసి చెరువులోకి చేప పిల్లలను విడుదల చేశారు. దీంతో మత్స్యకార కుటుంబాల్లో సిరులు కురవడమే ప్రబుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటితో పాటుగా ఎంపీ రఘురాం రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ విజయ బాబు, రాష్ట్ర మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా మత్స్య శాఖ అధికారి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.