calender_icon.png 27 October, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపట్లలో విషాదం.. నలుగురు హైదరాబాద్ యువకులు గల్లంతు

29-05-2024 04:08:41 PM

హైదరాబాద్: బాపట్ల జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కుకట్ పల్లికి చెందిన నలుగురు యువకులు సూర్యలంక బీచ్ వెళ్లారు. ఈ క్రమంలోనే నల్లమడ వాగులో యువకులు స్నానానికి దిగారు. అనంతరం యువకులు వాగులో గల్లంతయ్యారు.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి యువకుల మృతదేహాలు వాగులోంచి వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. బాదితులను సునీల్, సన్నీ, గిరి, నందుగా గుర్తించారు. మృతులను సునీల్, సన్నీగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.