ఒకరి మృతదేహం లభ్యం
ఖమ్మం, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఖమ్మం సాగర్ కాల్వలో నలుగురు గల్లంతయ్యారు. మణుగూరు పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి ఖమ్మం దానవాయిగూడెం జిల్లా జైలులో ఉన్నాడు. రాముకు పరిచయస్తులైన మణుగూరుకే చెందిన రొండ వెంక టేశ్వర్లు (33), చల్లా రమేష్(38), ప్రసాద్ (27), బండారు భరత్(30) సోమవారం మధ్యాహ్నం ములాకత్పై రామును చూసేందుకు ఆటోలో వెళ్లారు.
అతడ్ని చూసిన అనంతరం ప్రకాశ్నగర్, దానవాయిగూడెంలోని బంధువుల ఇళ్లకు వెళ్లి మద్యం సేవిం చారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్నామని చెప్పి దానవాయిగూడెం ఎన్ఎస్పీ కెనాల్ వద్దకు వెళ్లారు. కాల్వకట్ట పక్క న ఆటో నిలుపుకున్నారు. రొండ వెంకటేశ్వర్లు ఆటోలో నిద్రి స్తుండగా చల్లా రమేష్, ప్రసాద్, బండారు భ రత్ స్నానం చేసేందుకు కాల్వలో దిగారు.
మద్యంమత్తులో ముగ్గురు కాల్వలో కొట్టుకుపోయారు. ఉదయం పది గంటలకు నిద్రలే చిన రొండ వెంటకటేశ్వర్లు తనతో వచ్చిన వారు కనిపించకపోవడంతో కాల్వ కట్టపైకి వెళ్లి చూడగా వారి దుస్తులు కనిపించాయి. పోలీసులుకు సమాచారం ఇవ్వగా.. ఖమ్మం టౌన్ సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో గజ ఇతగాళ్లతో గాలిం పు చేపట్టగా బండారు భరత్ మృతదేహం లభ్యమైంది.