చర్ల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): నిషేదిత మిలిషియా మావోయిస్టు పార్టీకి చెందినన సభ్యులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం చర్ల మండలం తాలిపేరు డ్యామ్పైన పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అనుమానా స్పదంగా ప్రవర్తించిన నలుగురిని అరెస్ట్ చేసి ఓఎస్డి సా మనోహర్, చర్ల సీఐ రాజువర్మలు తెలిపారు. కాగా అరెస్ట్ అయిన వారిలో బీజా జిల్లా పోలంపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి ఊర అలియాస్ సోమన్న, చత్తీస్గడ్ రాష్త్ర సుక్మా జిల్లా పార్టీ సభ్యుడు జేగు ఏరియా కమిటీ మడకం ఉంగ, దంతెవాడ జిల్లా ఆలనర్ గ్రామానికి చెందిన కడితి లక్కే, సుక్మా జిల్లా గొండపల్లి గ్రామానికి చెందిన సోడి సుక్కిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.