calender_icon.png 21 September, 2024 | 5:41 AM

నలుగురు మిలీషియా సభ్యుల అరెస్టు

20-09-2024 12:27:45 AM

చర్ల, సెప్టెంబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింత గుప్ప అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న నిషేధిత మావోయిస్టు మిలీషియా సభ్యులు నలుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశా రు. వారి నుంచి పలు వాహనాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్నారు. అరెస్టు చేసిన వారి వివ రాలను చర్ల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ అకింత్‌కుమార్ సంక్వార్ మీడియాకు వెల్లడించారు.  చింతగుప్ప  గ్రామాల అటవీ ప్రాం తంలో ఓ జామాయిల్ తోట దగ్గరలో ఒక డీసీఎం, రెండు ట్రాక్టర్లు కన్పించాయి.

ఆ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా నలుగురిని పట్టుకున్నారు. వారిని విచారించగా నిషేదిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని జూరపల్లికి చెందిన పోడియం సమ్మయ్య, సుక్మా జిల్లా నిమ్మలగూడెంకు చెందిన పూనెం రూపేశ్, అదే గ్రామానికి చెందిన వెడమ శ్రీను, గట్టుపల్లి రమేశ్‌గా గుర్తించినట్టు ఏఎస్పీ తెలిపారు.