కొండపాక, సెప్టెంబర్ 11: గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరా లిలా ఉన్నాయి.. పొన్నాల గ్రామం నుంచి సిద్దిపేట వైపు రెండు బైక్లపై నలుగురు యువకులు గంజాయి సరఫరా చేయడానికి వస్తున్నారనే సమాచారం అందడంతో త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి ఇందుర్ కాలేజీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి న యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 50 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. గంజాయితో పాటు 4 సెల్ ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టు బడిన వారిని నాచారం సాయికుమార్, కోటగల్ల ఆదర్శ్, తలారి రాకే ష్, దయ్యాల శ్రీకాంత్గా గుర్తించారు.
ఎల్బీ నగర్లో..
ఎల్బీనగర్: నగరంలోని రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న మహ్మద్ బషీర్ అలియాస్ ఫైజల్ అలియాస్ సైఫాన్ సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి విక్రేతగా మా రాడు. బుధవారం ఎల్బీనగర్లోని ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ వద్ద గంజాయి విక్రయించడానికి ప్రయత్నించగా, విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 18 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.