calender_icon.png 29 March, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ .10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

26-03-2025 01:15:44 AM

పెద్ద కొడప్గల్, మార్చి 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని పోచారం తండాలో మంగళవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులలో రూ. 10 లక్షల రూపాయలతో పోచారం తండాలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ లో భాగంగా పెద్ద కొడప్గల్ మండలానికి రూ 10 లక్షలు నిధులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇచ్చినందుకు గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు  ఎన్‌ఆర్‌ఈజీఎస్ లో భాగంగా నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మషనప్ప పటేల్ , శామప్ప పటేల్, బంతిలాల్, నాగరాజ్, పడవాల్ బచ్చన్, కానా నాయక్, నారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.