కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో బిస్మిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ 40 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీస ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. మృతులు హైదరాబాద్కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనిని ప్రయాణిస్తోంది. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.