08-04-2025 06:02:12 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దఫిదర్ శోభ రాజు కూతురు వివాహం ఈనెల 20వ తేదీన కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు భారత రాష్ట్ర సమితి గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించి తమ కూతురు వివాహానికి తప్పకుండా రావాలని కోరారు.