calender_icon.png 15 October, 2024 | 3:55 PM

ఈసీఐఎల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి

15-10-2024 01:15:43 PM

కాప్రా, (విజయక్రాంతి): మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు ఈసీఐఎల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం గారు దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన ఆశయాలు కనుగుణంగా మనమంతా నడుచుకోవాలని అన్నారు. మహారాష్ట్రలో పేపర్ అసోసియేషన్ సభ్యులకు ప్రభుత్వం వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పేపర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ న్యూస్ పేపర్ హాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటరమణ, సుధాకర్, చితారి రాజు, హమీదు, సాయి నరేష్ ఎం నరేష్, నరసింహ గురు స్వామి రోశయ్య తదితరులు పాల్గొన్నారు