28-03-2025 05:33:03 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలం కేంద్రంలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షులు సున్నం సాయిలు అధ్యక్షతన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఒకే దేశం ఒకే-ఒకే ఎన్నిక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సున్నం సాయిలు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ ఒకే దేశం-ఒకే ఎన్నిక ఉండాలని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడితే దానికి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.