మాజీ మంత్రి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం
బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో చేరిక
కామారెడ్డి (విజయక్రాంతి): బిఆర్ఎస్ నుంచి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివ లింగు శ్రీనివాస్ శుక్రవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. గతంలో శివలింగ శ్రీనివాస్ కాంగ్రెస్ లోనే పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన టిఆర్ఎస్ లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదులో సుదర్శన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో శివలింగ శ్రీనివాస్ చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శివలింగ శ్రీనివాసును అభినందించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని శివలింగ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన వంటి పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు.